ముందుగా పెసరపప్పును నానబెట్టుకుని పిండి రుబ్బుకోవాలి. పిండిని గట్టిగా రుబ్బుకుంటే మంచిది. ఒక బౌల్లో ఉల్లిముక్కలు, అల్లం, మిర్చిముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుతూ పది నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి.
పెనం వేడిచేసి ఒక గరిటెడు పెసరట్టు పిండిని దోసెలా వేసి, దానిపై ఉల్లిమిశ్రమాన్ని పరచాలి. అట్ల కాడతో మూడు చెంచాల నూనె అట్టు మొత్తం కలిసేలా అదుముతూ, ఎర్రగా కాల్చాలి. అంతే పెసరట్టు రెడీ. అయితే అట్టు కాలిన తరువాత జాగ్రత్తగా ప్లేటులోకి తీసుకోవాలి.