పచ్చి బఠాణీలు, మొక్కజొన్న, కాస్తంత ఉప్పు, ఆరు కప్పుల నీళ్లు కలిపి సన్నటి మంటపై పది నిమిషాలపాటు ఉడికించాలి. చల్లారిన తరువాత మిక్సర్లో వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లోనే పాలు, కొత్తిమీర, పుదీనా వేసి మళ్లీ స్టవ్పై పెట్టి కాసేపు ఉడికించి, దించి సర్వింగ్ బౌల్స్లో పోసి సర్వ్ చేయాలి. అంతే వేడి వేడి సూప్ తయార్..! ఇందులోని పోషకాలు తక్షణ శక్తిని అందించటమేగాకుండా, పిల్లల మెదడు చురుగ్గా ఉండేలా చేస్తాయి. దీంతో పరీక్షలు కూడా చక్కగా రాస్తారు.