చేపను బాగా శుభ్రం చేసి ముక్కలుగా కోయాలి. వాటికి ఉప్పు, నిమ్మరసం పట్టించాలి. గంటసేపయ్యాక బాణలిలో నూనె వేడి చేసి ముక్కల్ని వేయించి పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో ఐదు చెంచాల నూనెను వేడి చేసి ఉల్లిపాయ మిశ్రమాన్ని పచ్చి వాసన పోయే దాకా వేయించాలి. నూనె పైకి తేలాక అల్లం వెల్లుల్లి ముద్ద చేర్చాలి. రెండు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు, కారం, పసుపు, అజినోమోటో, కేసరి రంగు, మసాలా పొడి కలపాలి. ఇప్పుడు కప్పు నీరు, వేయించిన చేప ముక్కల్ని చేర్చి మూత పెట్టేయాలి. చేప ముక్కలు ఉడికాక..కొత్తిమీర చల్లి దింపేస్తే చాలు. నోరూరించే చేప కూర సిద్ధం.