నాలుగు డబ్బాల నీళ్లలో ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు స్టౌమీద నుండి దించి అందులో వాము, కారం, బియ్యంపిండి, మైదా, నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు అలాగే ఉంచాలి. చల్లారాక బాగా కలిపి ముద్ద చేయాలి. దీన్ని చిన్న చిన్న ఉండలు తీసుకుని తాడులా చేసి గుండ్రంగా చుట్టాలి. వీటిని కాగిన నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.