బియ్యపు పిండి, ఉప్పు, నూరిన పచ్చి మిరపకాయలు, వెన్న, శనగపప్పు, కరివేపాకు అ న్నింటినీ తగినంత నీళ్ళు వేసి కలపాలి. పిండి గట్టిగా ఉండాలి తప్ప జారుగా కాకూడదు. తర్వాత పిండిని ఒక అరగంట సేపు నా ననివ్వాలి. తర్వాత దానిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక పాలిథిన్ కవర్పై కాస్త నూనె రాసి చెక్కలను చేతులతో వత్తాలి. పొయ్యి మీ ద బాణలిలో తగినంత నూనె పోసి చెక్కలను ముదురు గోధుమ రంగు వచ్చే వర కు వేగనివ్వాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తిం టారు. ఇవి నెలరోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి.