మసాలాకోసం:
ముందుగా చికెన్ని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్లో పైన మసాలా కోసం చెప్చిన దినుసులను, పచ్చికొబ్బరి వేసి రోస్ట్ చేసి వేడి తగ్గిన తరవాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని చెట్టినాడ్ మసాలా అంటారు. పక్కన వేరొక పాన్లో చికెన్ ముక్కలు, పెరుగు, పుదీనా, కరివేపాకు, కాశ్మీరీమిర్చి, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి దగ్గరగా వచ్చే వరకు ఉడికించాలి. అందులో పైన పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కలిపి కాస్త వేయించిన తర్వాత ఉడికించిన రైస్, వేయించిన ఉల్లిపాయ తరుగును కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ బిర్యానీని రైతాతో తింటే మంచి రుచిగా ఉంటుంది.