చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయండి.తరువాత అందులో దంచిన మిరియాలపొడి ,పెరుగు,కొంచెం అల్లంవెల్లుల్లిముద్ద,నిమ్మకాయరసం,తగినంత ఉప్పు వేసి చికెన్ ముక్కలకు బాగా అంటేలా పట్టించి అరగంట సేపు నానబెట్టండి. తరువాత స్టవ్ మీద ఉంచిన
గిన్నె
లో నూనె పోసి కాచక ముందుగా ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసాక ,మిగిలిన అల్లంవెల్లుల్లి
ముద్దను
,కారం.టమోటాముక్కలని వేసి కలుపుతూ నూనె పైకి తేలే వరకు ఉడికించండి. ఇప్పుడు అదే గిన్నెలో నానబెట్టిన
చికెన్
ముక్కలని వేసి,కలియబెట్టిన గిన్నె మీద మూత పెట్టి ఉడికించండి.చికెన్ ఉడక గానే గరంమసాలా పొడి,కొత్తి మీరా ,కరివేపాకు వేసి,దించి వేడివేడిగా రైస్ తో వడ్డించండి. అంతే చెట్టినాడు చికెన్ రెడీ