కాప్సికమ్ను, ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. పనీర్ను పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. పచ్చి మిరపకాయలను చీల్చి పెట్టుకోవాలి. టొమాటోలను చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె పోసి కాప్సికమ్, పనీర్, ఉల్లిపాయ ముక్క లు, టొమాటోలు ఒక దాని తర్వాత చిటికెడు ఉప్పు వేస్తూ వేసి వేయించి ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. నూనెను తిరిగి వేడి చేసి, దానిలో ఉల్లిపాయ పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత టొమాటో ప్యూరీ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అందులో కారం, మిరి యాల పొడి వేసి ఒక అర నిమిషం వేగనివ్వా లి. అందులోనే చిల్లీ సాస్, సోయా సాస్ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేసి ఒక నిమిషం తర్వాత కాప్సికమ్, పనీ ర్, ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి మూత పెట్టి ఐదు నుంచి నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. చిల్లీ పనీర్ రెడీ.