150 గ్రా. నెయ్యి తీసుకుని దానిని గోధుమ పిండిలో కలపాలి. అందులో కొద్ది నీరు పోసి గట్టి ముద్దగా చేసుకోవాలి. మిగిలిన నెయ్యిని బాణలిలో వేడి చేయ్యాలి. ఈ ముద్దను 15 లేదా 20 భాగాలుగా విభజించుకుని ముద్దలుగా చేసుకోవాలి. తర్వాత వీటిని నీటిలో వేసి బంగారు రంగు వచ్చే వరకు సన్నని మంట మీద వేయించాలి. అవి చల్లబడ్డ తర్వాత గ్రైండర్లో పొడి చెయ్యాలి. అందులో కోవా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి బాణలిలో వేసి వేడి చేయాలి. దానిలో ఇలాచీ, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తర్వాత కోవా కలిపిన గోధుమ పొడిని వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. అది చల్లబడిన తర్వాత పంచదార పొడిని, నానబెట్టి ముక్కలుగా చేసుకున్న బాదం పప్పులను కలపాలి. గాలిరాని డబ్బాలో పెడితే దాదాపు 8-10 రోజుల వరకూ ఇది నిల్వ ఉంటుంది.