ఒక్కొక్క దొండకాయను నిలువుగా రెండు ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలను నూనెలో వేయించి పక్కన ఉంచాలి. మరొక బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ పప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత వేయించిన దొండకాయ ముక్కలు, ఉప్పు, చింతచిగురు, మిరప్పొడి వేసి కలపాలి. పైన కొబ్బరి తురుము వేసి దించాలి.