పాలు బాగా చిక్కగా అయ్యేంతవరకు కాగబెట్టాలి. జొన్నపిండిని పావుకప్పు పాలలో కలిపి వుంచుకోవాలి. పంచదారలో నీళ్లు కలిపి తీగపాకం పట్టుకోవాలి. పాకంలో తరిగిన జున్నును కలపాలి. అందులోనే పాలు పోసి కొంచెం సేపు గరిటతో కటియబెడుతూ వుండాలి. బాగా చిక్కగా అయిన తర్వాత దించి పిస్తా, బాదంపప్పు వేసి చల్లార్చాలి. తర్వాత ట్రేలో పోసి ఫ్రీజర్లో 6 గంటలపాటు వుంచి సర్వ్ చేయాలి.