కడాయిలో నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి గోధుమరంగు వచ్చేంత వరకు వేయించాలి. దాంట్లో టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత గుడ్లు, కారం, జీలకర్ర-ధనియాలపొడులు, ఉప్పు వేసి పదిహేను నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించాలి.