పెసరపప్పుని దోరగా వేగించుకుని దానిలో పసుపు, తగినంత నీరు చేర్చి స్టౌవ్ మీద పెట్టాలి. పప్పు సగం ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు, కారం వేయాలి. పప్పు, ముక్కలు మెత్తబడ్డాక దించేసి ఉప్పువేసి కలపాలి. తర్వాత కడాయిలో ఎండుమిర్చి, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకుతో తాలింపు పెట్టి పప్పుని అందులో వేసి తిప్పాలి. (మహబూబ్నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో - ఇదే పద్ధతిలో కందిపప్పులో పండు (పసుపు వన్నె) వంకాయల్ని వేసి పప్పు చేస్తుంటారు. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది)