ముందుగా కొరమీను చేపను శుభ్రం చేసి సన్నగా ముక్కలుగా కోసుకుని ఉంచాలి. ఆ తరువాత ఓ పాన్ తీసుకుని నూనె వేసి కాగాక ఆ చేప ముక్కలను సన్నని సెగమీద ఎర్రగా వేయించాలి. వేయించిన ముక్కలను ఒక గిన్నెలోకి తీసి వాటికి మసాలా పొడి, ఉప్పు, కారం ముక్కలకు పట్టించి మళ్లీ ఆ ముక్కలను కాసేపు వేయించాలి. అంతే వేడివేడిగా సువాసనలతో అదిరిపోయే కొరమీను వేపుడు రెడీ.