కైమాలో పసుపు, అల్లం వెల్లుల్లిపేస్టు, కారం, ఉప్పు కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించాలి. గోరుచిక్కుడు తరుగులో తగినంత నీరు పోసి పచ్చివాసన పోయేలా 5 నిమిషాలు మాత్రం ఉడికించి నీరు వార్చేయాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ తరుగు వేగించి ఉడికించిన కైమా, గోరుచిక్కుడు తరుగు వేసి అరకప్పు నీరు చేర్చి ఐదునిమిషాల తర్వాత కొబ్బరి గసగసాల పేస్టు వేయాలి. 2 నిమిషాలు అయ్యాక గరంమసాలా, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి దించేయాలి. ఈ కూర పరాటాల్లోకే కాకుండా అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది.