మినప్పప్పుని రాత్రంతా నానబెట్టి రుబ్బుకోవాలి. తరవాత అందులో రంగు వేసి కలపాలి. మిక్సీలో పిండిని రుబ్బితే తరవాత చేత్తో బాగా గిలకొట్టాలి. ఇప్పుడు దీన్ని 3 గంటలు పులియనివ్వాలి. వాతావరణం చల్లగా ఉంటే ఆరు గంటలు పులియనివ్వాలి. పపంచదారలో నీళ్లు పోసి పలుచని తీగపాకం రానివ్వాలి. తరవాత యాలకుల పొడి వేసి ఉంచాలి. బాణలిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. ఇప్పుడు రంధ్రం ఉన్న ప్లాస్టిక్ బాటిల్ / బట్టలో పిండి మిశ్రమం వేసి జాంగ్రీల్లా చుట్టి తక్కువ మంట మీద వేయించి తీసి పాకంలో ముంచి నాలుగైదు నిమిషాలు ఉంచి తీయాలి.