వంకాయలను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి వాటికి ఉప్పు పట్టించి 20 నిమిషా లు పక్కన పెట్టుకోవాలి. ముక్కలు ఎండి న తరువాత వాటిని నూనెలో ఎర్రగా వేయించాలి. ముక్కలను బయటకు తీసి పేపర్ నాప్కిన్ ఉపయోగించి వాటికి ఉ న్న నూనెను తీసివేయాలి. మిగిలిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, జీలకర్ర వేసి బాగా వేయిం చాలి. అవన్నీ బాగా వేగిన తరువాత అందులో చింతపండు గుజ్జుని వేసి కొద్ది నిమిషాలు ఉడికించాలి. దించే ముందు అందులో వంకాయ ముక్కలను వేయాలి. ఇది చపాతీల్లోకి కానీ అన్నంలోకి కానీ రుచిగా వుంటుంది.