ఉల్లిపాయలు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుమును మిక్సీలో తీసుకుని మెత్తగా మిశ్రమంలా చేసుకుని దాన్ని కొబ్బరిపాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో బియ్యప్పిండి, ముప్పావుకప్పు కొబ్బరి తురుమూ తీసుకుని బాగా కలిపి బాణలిలో వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక అప్పుడు కొబ్బరిపాలు పోసేయాలి. రెండు మూడు నిమిషాలు కలిపి వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిలా వచ్చేలా కలపాలి. ఈ పిండి చపాతీ పిండిలా మెత్తగా ఉండేలా చూసు కోవాలి. ఇందులో నువ్వులు వేసి మరో సారి కలిపి పైన తడి బట్టను కప్పి కనీ సం అరగంట నాన నివ్వాలి.ఇప్పుడు కొద్ది గా పిండిని తీసుకుని చిన్న చపాతీలా వత్తాలి. దీన్ని చపాతీలు వత్తే కర్రకు చుట్టాలి. అప్పుడిది సగం రోల్ లా వస్తుంది. వీటన్నింటినీ వేడి నూనెలో బాగా వేయి ంచుకుని తీసు కోవాలి.