ఒక బాణలిలో 4 చెంచాల నూనె పోసి వేగాక ఒక చెంచా ఆవాలు, 4 చెంచాల సెనగపప్పు,3 చెంచాల మినప్పప్పు,2 ఎండు మిరపకాయలు వేసి ఎర్రగా వేయించాలి. చివర్లో కరివేపాకు, ఇంగువ వేసి వేరే పాత్రలోకి మార్చుకోవాలి. బాణలిలో నూనె వేయకుండా మిగిలిన ఆవాలు, సెనగపప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి ఎర్రగా వేయించాలి. చల్లారిన తర్వాత తాలింపు పొడి ఇంకో భాగం, క్యాప్సికం ముక్కలు నానబెట్టిన చింతపండు మిక్సీలో వేసి చట్నీ చేయాలి. మొదట తయారు చేసిన తాలింపు కలిపితే రుచికరమైన క్యాప్సికం చట్నీ రెడీ.