పోపు కోసం:-
నూనె లేదా నెయ్యి, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - ఒక కట్ట
బాణలిలో నూనె లేకుండా శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, ఎండుకొబ్బరి తురుము, ఎండుమిర్చి, నువ్వులను దోరగా వేయించి పక్కనుంచుకోవాలి. చల్లారిన తరవాత అందులో మిరియాలు, జీలకర్ర, ఇంగువ వేసి గ్రైండర్లో మెత్తగా చేసి పక్కనుంచుకోవాలి. కుకర్ లో కందిపప్పు, పెసరపప్పు, పాలకూర తరుగు, పల్లీలు, పసుపు, తగినంత నీరు పోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉంచి దింపేయాలి. చల్లారాక అందులో పొడి చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి రెండు పొంగులు రానిచ్చాక పాలు, పంచదార, ఉప్పు వేసి బాగా కలిపి దింపేయాలి. బాణలిలో నూనె వేడయ్యాక పోపు సామాను గోధుమరంగు వచ్చేవరకు వేయించి దానిని కూటులో వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. పాలకూర కూటు ఇడ్లీ, దోసె, చపాతీ, అన్నంలోకి బావుంటుంది.