మొదట చేపలు శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత బాగా ఉప్పు పులిమి కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలను మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఉల్లిపాయల పేస్ట్, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు, మిరపపొడి, కొత్తిమీర కలుపుకుని ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించాలి. తరువాత మామిడికాయను ముక్కలుగా కోసి ఒక పాత్రలో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.ఈ మిశ్రమాన్ని చేపముక్కలున్న పాత్రలో పోసి చిన్న మంటపై నెమ్మదిగా ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తరువాత దించుకోవాలి. అంతే మ్యాంగో చేపల పులుసు రెడీ.