మామిడిపండు పై తొక్కుతీసి చిన్న ముక్కలు కోసుకోవాలి. మామిడి ముక్కలు, పంచదార, పాలు, పాలపొడులను వెడల్పాటి పాన్లో వేసి కలుపుతూ దగ్గర అయ్యేంతవరకు మరిగించి దించాలి. అందులో ఏలకుల పొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. చల్లారిన తర్వాత గడ్డకట్టేంత వరకు ఫ్రిజ్లో పెట్టాలి. అంతే మ్యాంగో కుల్ఫీ రెడీ. ఈ మిశ్రమాన్ని కప్పుల్లో వేసుకుని పైన చెర్రీ ముక్కలు వేసుకుంటే చాలా బావుంటుంది.