గిన్నెలో నూనె వేసి వేడయ్యాక, ఉల్లిపాయలు వేయించుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాలపొడి, పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా నీరు కలిపి ఉడికించాలి. టొమాటో తరుగు వేసి నాలుగైదు నిమిషాలు ఉడికించి, మంట తీసేయాలి. చల్లారిన తర్వాత గరిటెతో లేదా మిక్సీలో వేసి పేస్ట్ చే యాలి. టొమాటో పేస్ట్లో కప్పు నీళ్లు చేర్చి, మళ్లీ మరిగించాలి. మంట తగ్గించి, దీంట్లో పచ్చి బఠాణీలు వేసి ఉడికించాలి. తర్వాత పనీర్ ముక్కలు, ఉప్పు వేసి 8 నిమిషాలు ఉడకనివ్వాలి. మీగడ, గరంమసాలా, కసూరి మెంతి పొడి వేసి కలిపి, కొద్దిగా ఉడికించి, మంట తీసేయాలి.
థిక్గా అయితే, కొద్దిగా పాలు కలపాలి. ఈ మటర్ పనీర్ను రోటీ మధ్యలో పెట్టి, రోల్ చేసి, బాక్స్లో పెట్టాలి లేదా విడిగానూ బాక్స్లో పెట్టి ఇవ్వవచ్చు.