జీరాను వేగించి, పొడి చేసి, కొబ్బరి తురుము, వెల్లుల్లి జతచేసి పేస్టులా గ్రైండు చేసిపెట్టుకోవాలి. పెసరపప్పుని మెత్తగా ఉడికించాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, మునగాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగాక ఉడికిన పప్పుని వేసి తిప్పాలి. అవసరమనిపిస్తే కొద్ది నీరు కలపొచ్చు. ఉప్పు, కారం కూడా వేసి 5 నిమిషాలు ఉడికించి, కొబ్బరిమిశ్రమాన్ని వేసి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. అన్నంలోకి ఈ పప్పు చాలా బాగుంటుంది.