టొమాటో, జీడిపప్పు, బాదంపప్పు, పాలు, షాజీరా, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, ఉప్పు, మిరప్పొడి, పసుపు, పచ్చిమిర్చి, చిరోంజీ, అన్నిటినీ మిక్సీలో వేసి పేస్ట్లా చేయాలి. బాణలిలో నూనె కాగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. బిరియానీ ఆకులు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చాక, మష్రూమ్స్ వేసి మెత్తబడే వరకు వేయించాలి. ముందుగా తయారుచేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసి , ఉడకడం ప్రారంభమయ్యాక స్టౌని సిమ్లో ఉంచి సుమారు పది నిముషాలు ఉడికించాలి. కడైలోకి తీసుకుని క్రీమ్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.