మష్రూమ్స్ను తీసుకొని శుభ్రం చేసి, ఉడికించి వాటిని మీడియం సైజు ముక్కలుగా చేసుకోవాలి. పనీర్ను తురుముకోవాలి. బాణలిని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపా య ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో పచ్చి మిర్చి, మష్రూమ్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత తురిమి పెట్టుకున్న పనీర్ వేసి కలపాలి. పనీర్ కరిగిన తర్వాత అది తక్కుపోతుంది కనుక బాగా తిప్పుతూ ఉండాలి. దానిలో ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలియతిప్పాలి. పదార్ధాలన్నీ వేగిన తర్వాత దించి కొత్తిమీరతో అలంకరించి సాస్ వేసి సర్వ్ చేయాలి.