ఉప్పు కలిపిన వేడినీటిలో మష్రూమ్ ముక్కలను అర గంటసేపు నానబెట్టాలి బాణలిలో నూనె కాగాక ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి మష్రూమ్ ముక్కలు, మిరియాలపొడి, కరివేపాకు పొడి, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి వేయించాలి నిమ్మరసం జతచేసి రెండు నిముషాల తరువాత దించేయాలి.