ఒక పాత్రలో మటన్ ఖీమా, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుకారం, ఉప్పు, ధనియాలపొడి, శనగపిండి, గరంమసాలా, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమంతో బాగా పట్టేలా కలపాలి. స్టౌ పై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి. తర్వాత ఆ గుడ్డును తీసి నూనెలో వేసి ఖీమా మిశ్రమం గోధుమరంగులోకి మారేంతవరకు అటూ ఇటూ తిప్పి వేయించాలి. ఆ తర్వాత గుడ్డును గుండ్రని ముక్కలుగా కట్చేసి ప్లేట్లో సర్ది వేడి వేడిగా టేస్ట్ చేయాలి.