నాన్స్టిక్ పాన్లో నట్స్ వేసి కొద్దిగా వేయించాలి. అందులో పంచదార వేసి, కరిగించాలి. తర్వాత పాన్ దించి, పంచదార మిశ్రమాన్ని చల్లబడేంతవరకు ఉంచాలి. ఈ మిశ్రమాన్ని మిక్సర్లో వేసి, కొద్దిగా క్రష్ చేయాలి. పెరుగును బాగా చిలికి, అందులో చల్లటి నీళ్లు పోయాలి. క్రష్ చేసిన పంచదార మిశ్రమాన్ని గార్నిష్ చేసి, చల్ల చల్లగా సర్వ్ చేయాలి.