చింతపండుని నానబెట్టి రసం తియ్యాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, కారం, కొత్తిమీర, నువ్వుల పొడి, ఉప్పు వెయ్యాలి. బాండీలో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలతో తిరగమోత వేయాలి. దీన్ని చింతపండు రసంలో కలపాలి. అంతే పచ్చిపులుసు రెడీ. తీపి ఇష్టమైనవాళ్లు కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు.