మైదాలో నెయ్యి లేదా డాల్డా వేసి కలిపి సోడా, బేకింగ్ పౌడర్, తగినంత ఉప్పు, ఉడికించిన బంగాళదుంప వేసి చపాతీ పిండిలా కలిపి మూతపెట్టి అరగంట నానబెట్టాలి. పాన్లో చెంచాడు నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారట్, క్యాప్సికమ్ వేసి దోరగా వేయించాలి. ఇందులో ఉడికించిన సేమ్యా, ఉప్పు, మిరియాలపొడి, అజినమోటో వేసి మరో రెండు నిముషాలు వేయించాలి. కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. ఒక పూరీపై కూర మిశ్రమాన్ని పెట్టి మరో పూరీతో మూసి చుట్టూ అంచులు విడిపోకుండా తడి అద్ది, గట్టిగా ఒత్తి వేడి నూనెలో వేసి, నిదానంగా కరకరలాడే వరకు వేయించాలి. పొటాటోసేమ్యా కచోరీ - Potatosamiya Kachori లను టొమాటో సాస్తో సర్వ్ చేయాలి.