పెసరపప్పును ఒక పది నిమిషాల పాటు నీళ్ళ లో నాన బెట్టాలి. ఈ లోపల సొరకాయను సున్నితంగా చెక్కుతీసి ముక్కలు చేసుకోవాలి. తర్వాత పప్పును వాడ్చి నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి కాస్త నూనె వేసి పెసరపప్పును 2,3 నిమిషాల పా టు వేయించుకోవాలి. తర్వాత దానిలో సొరకాయ ముక్కలు, జీలకర్ర , కారం అన్నీ వేసి మరో రెండు నిమిషాల పాటు మీడియం మం ట మీద వేగనివ్వాలి. తర్వాత మంట తగ్గించి అందులో మూడు కప్పుల నీళ్ళు పోసి తగినం త ఉప్పు వేయాలి. దీనిని ప్రెషర్ కుక్కర్లో ఉ డికించాలి. దీనిలో పోపు పెట్టాలి. ఇది చపాతీలతో, అన్నంలో తినడానికి కూడా బాగుంటుంది.