1. మొదటగా స్టౌవ్ పై కడాయి పెట్టి అందులో విడివిడిగా పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు, రాగి పిండి వేయించి పెట్టుకోవాలి.
2. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకొన్న పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
3. ఈ తర్వాత ఈ మిశ్రమానికి పైన వేయించి పెట్టుకున్న రాగిపిండి కలిపి, దాంతో పాటు ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పు నెయ్యి, యాలకల పొడి వేసి బాగా కలిపి లడ్డుగా చేసుకుని పైన జీడిపప్పు, ద్రాక్షతో గార్నిష్ గా అలంకరిస్తే రాగి లడ్డు రెడీ. (రాగి పిండి మరీ పొడిగా ఉంటే కొద్దిగా పాలు కలిపి లడ్డులా చేసుకోవచ్చు)