బాండీలో వెన్న కరిగించి అందులో అన్నం, అల్లం ముక్కలు వేయించాలి. కొద్దిసేపయ్యాక ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నమంట మీద ఉడికించాలి. సగం నీళ్లు ఇంకి పోయాక టమాటా రసం, మిరియాల పొడి, ఉప్పు కలపాలి. తర్వాత అందులోనే చీజ్ వేసి పొయ్యి కట్టేయ్యాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని ఉండలు చేసుకుని కొద్దిగా వెడల్పుగా (కట్లెట్ ఆకారంలో) చేసి కాగిన నూనెలో వేయించుకోవాలి. వీటిని అల్లం చట్నీ లేదా టమాటా సాస్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.