ఖర్జూరాల్లోని గింజలు తీసి చిన్న పలుకుల్లా చేసుకోవాలి. వీటిని నేతిలో 20 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి మెత్తగా అయ్యాక పాలు పొయ్యాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత డ్రైఫ్రూట్స్ పలుకులు కలిపి స్టౌ మీద నుండి దింపేయాలి. వేడి తగ్గాక ఫ్రిజ్లో పెట్టాలి. వీటిని రోల్స్లా చుట్టుకుని కొబ్బరి పొడిలో అద్ది, పైన వేయించిన వేరుశనగ పప్పు పలుకులు పెడితే సరి. కమ్మటి ఖర్జూర రోల్స్ నోరూరిస్తాయి.