సగ్గు బియ్యాన్ని ఆరేడు గంటలు నానబెట్టి, నీరు తీసేయాలి. ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి సగ్గుబియ్యాన్ని సన్ననిమంటపై ఉడికించాలి. అడుగు అంటకుండా కలుపుతుండాలి. ఉడికిన తరువాత నాలుగు కప్పుల పాలు పోసి, కొద్దిగా కాగాక పంచదార వేసి రెండు నిముషాలు ఉడికించాలి. చిన్న పాత్రలో నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్మిస్లు వేసి వేయించాలి. ఉడికిన సగ్గుబియ్యం పాయసంలో ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసి కలిపి దించేయాలి. వేడివేడిగా సర్వ్ చేయాలి.