బియ్యప్పిండిలో పైన తీసుకున్న వాటిలో నూనె మినహా మిగిలిన అన్ని పదార్థాలనూ వేయాలి. తర్వాత తగినన్ని వేడి నీటితో చపాతీల పిండిలా కలుపుకోవాలి. మందంగా ఉండే అల్యూమినియం పాత్ర లోపలి అంచులకు నూనె రాయాలి. ఆ తర్వాత పిండి మిశ్రమాన్ని పాత్ర అంచులకు అంటేటట్లు అద్ది, పైన స్పూను నూనె వేసి సన్న మంట మీద కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత అప్పం గిన్నెను వదిలి ఊడి వస్తుంది. దాన్ని తీసి మరొక వైపుకు అమర్చి కాల్చాలి. ఈ అప్పం కాలేటప్పుడు గిన్నెకు మూత పెట్టకూడదు. అల్యూమినియం పాత్రకు బదులు స్టీలు పాత్ర వాడితే అప్పం కాలకముందే మాడిపోతుంది. నాన్స్టిక్లో అప్పం వచ్చినప్పటికీ రుచిగా అనిపించదు. అల్యూమినియం పాత్ర లేకపోతే బాణలిలో చేసుకోవచ్చు.