రొయ్యలు వాసన పోవాలంటే ముందుగా రెండు నిమిషాలు వేడినీటిలో వేసి రెండు పొంగులు వచ్చాక తీసి వడగట్టి బట్టమీద వేసి ఆరనివ్వాలి. మూకుడులో నూనెపోసి కాగిన తరువాత రొయ్యలను వేయించాలి. రొయ్యలు త్వరగా వేగిపోతాయి. మరీ ఎక్కువ సేపు ఉంచితే గట్టిపడతాయి. వేగిన రొయ్యలను గిన్నెలోకి తీసుకోవాలి. రొయ్యలపచ్చడిలో లవంగాల పొడి కాస్త ఎక్కువగా, కారం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అన్ని పచ్చళ్ళ మాదిరిగానే ఒక కప్పు నూనెలో కారం, ఉప్పు, మసాలాపొడి, రొయ్యలు కలిపి, నిమ్మకాయ పిండితే పచ్చడి రెడీ అయినట్టే. నీసులేనిదే ముద్ద దిగని మాంసం ప్రియులకు ఇలాంటి పచ్చడి ఇంట్లో ఉంటే జిహ్వచాపల్యం తీరుతుంది.