ముందుగా ఖీమాను ఒక బౌల్లో వేసుకొని అందులో నిమ్మ రసం, ఉప్పు, అల్లం వెలుల్లి పేస్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టు కోవాలి. అరగంట తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో బిర్యానీ ఆకు, మిరి యాల పొడి, ఉల్లిపాయ ముక్క లు వేసి సన్నని మంట మీద ఫ్రౖౖె చేసుకోవాలి. ఉల్లి పాయ ముక్కలు బంగారు వర్ణంలోకి మారిన తర్వాత అందులో మ్యారినేట్ చేసిన ఖీమా వేసి మీడియం మంట మీద 5 నిమి షాలు ఉడికించు కోవాలి. తర్వా త అందులో ఆకు కూర మిక్స్ చేసి ఖీమాతో బాగా కలపాలి. తర్వాత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మొత్తం మిశ్రమం ఉడికిన తర్వాత గరం మసాలా మరి యు కొత్తిమీర తరుగు వేసి కల పాలి. అంతే ఈ ఖీమా సాగ్ రెడీ.