కడాయిలో నూనె వేసి, ఉల్లిపాయలు, అల్లం తరుగు, కొత్తిమీర, అల్లం-వెల్లుల్లి పేస్ వేయించాక కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత సోయాబీన్ పొడి, బ్రెడ్ క్రంబ్ పొడి వేసి కలిపి, వేయించాలి. ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని తగినంత తీసుకొని, చేతులతో మిర్చి బజ్జీ అంత సైజు చేయాలి. వీటిని బొగ్గుల మీద లేదా గ్రిల్లోనైనా కాల్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చాకుతో మధ్యకు కట్ చేయాలి. వీటిని పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి.