ఒక పెద్ద గిన్నెను స్టౌ మీద పెట్టి, నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో సేమ్యా వేసి సన్నని మంట మీద ముదురు గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించాలి. గిన్నెలో నుంచి సేమ్యాని మరొక పాత్రలోకి తీసుకోవాలి. సేమ్యా వేయించిన గిన్నెలోనే పాలు పోసి మరిగించాలి. బియ్యప్పిండిలో కొద్దిగా చల్లని పాలు కలిపిన మిశ్రమాన్ని, పంచదార, ఏలకుల పొడి... వీటిని మరుగుతున్న పాలలో పోసి కలిపి, సన్నని మంట మీద ఉడికించాలి. అందులో తరిగిన ఖర్జూరం, బాదంపప్పు, కిస్మిస్, పిస్తాపప్పు, కొబ్బరి ముక్కలు వేసి కలపాలి. సేమ్యా వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఐదు నిమిషాలు ఉంచి, తీయాలి.