ముందుగా నానబెట్టిన బియ్యంలో నాలుగు టేబుల్ స్పూన్లు విడిగా తీసుకుని మెత్తగా దోశపిండిలా గరిటెజారుగా రుబ్బుకోవాలి. ఈ పిండిని బాణలిలో వేసి పొయ్యిమీద పెట్టాలి.ఈ పిండిని బాణలిలో వేసి పొయ్యిమీద పెట్టాలి. మంట తగ్గించి మధ్య మధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి గట్టిపడుతుంది. అప్పుడు దింపేయాలి. ఇప్పుడు కిస్ మిస్, జీడిపప్పు తప్ప మిగిలిన పదార్థాల్ని తీసుకుని కొద్దికొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ ఇడ్లీ పిండిలా రుబ్బుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పిండిని వేసి బాగా కలిపి ఓ పెద్ద గిన్నెలోకి తీసుకుని ఓ రాత్రంతా నాననివ్వాలి. మర్నాటికి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని నెయ్యి రాసిన గిన్నెలోకి సగం దాకా తీసుకుని పైన కిస్మిస్, జీడిపప్పు చల్లి ఆవిరి మీద పది నిమిషాల వరకూ ఉడికించి తీసుకోవాలి. దీన్ని చికెన్ కర్రీ లేదా ఎగ్ కర్రీతో కలిపి అల్పాహరంలా వడ్డించాలి.