ముందుగా క్యారట్, బీన్స్, బంగాళదుంపలను చిన్నముక్కలుగా కట్ చేసి వాటిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పాన్లో నూనె వేడయ్యాక అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసి వేయించాలి. తరవాత కరివేపాకు, ఉడికించిన కూరముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.