మినప్పప్పు ఓ పూట ముందుగా నానబెట్టి ఉంచాలి. బియ్యం కూడా ఓ పూట ముందుగానే కడిగి నానబెట్టి ఉంచి, మినప్పప్పు వేసి కలిపి మెత్తగా రుబ్బాలి. పచ్చిశెనగపప్పును ఓ గంట ముందుగానే నానబెట్టాలి మరియు రుబ్బుకోవాలి . ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంలను సన్నని ముక్కలుగా కోయాలి. రుబ్బుకున్న పిండిలో పచ్చిసెనగపప్పు, ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, వంటసోడా వేసి గారెలపిండికన్నా కాస్త మెత్తగా కలపాలి.
మీడియం సైజులో పిండిముద్దను తీసుకుని గుండ్రంగా చేసి నూనెలో వేసి బాగా వేయించాలి. వీటిని వేడివేడిగా వేరుశెనగ పచ్చడి లేదా ఎర్ర పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. కాస్త పుల్లగా తినాలనుకుంటే పిండిలో అన్నీ వేసి కలిపి ఓ పూట నిల్వ ఉంచితే పిండి పులిసి రుచిగా ఉంటాయి. అయితే అజీర్తి ఉన్నవాళ్లకి పులవకుండా ఉంటేనే మంచిది.